English | Telugu

బాలయ్య వందో సినిమాకు ఈయనే నిర్మాత

బాలయ్య వందో సినిమా ఎలా ఉండబోతోందా అని నందమూరి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందో సినిమాకు డైరెక్టర్ ఎవరు అనే దానిపై అనేక కథనాలు వస్తున్నా, తాజాగా ఈ సినిమాకు నిర్మాతలు ఎవరో ఫిక్సైపోయింది. ఇప్పటికే బాలయ్యతో లెజండ్ లాంటి సినిమాను సంయుక్తంగా తీశారు వారాహి చలనచిత్రం, 14 రీల్స్ సంస్థలు. తాజాగా, సాయి కొర్రపాటి నిర్మాణంలో, మళ్లీ ఈ రెండు సంస్థలు కలిసి బాలయ్య వందో సినిమాను తెరకెక్కించబోతున్నాయి.

ఈ విషయమై సాయి కొర్రపాటి ఇప్పటికే తేల్చేశారు. కానీ డైరెక్టర్ ఎవరు అన్నదానిపైనే ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారమైతే, కృష్ణవంశీయే బాలయ్యతో డైరెక్షన్ ఛాన్స్ కొట్టబోతున్నాడు. మరో పక్క బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి కూడా హింట్ ఇచ్చారు సాయి. మోక్షును కూడా తనే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ఆయక క్లియర్ గా చెప్పేయడం విశేషం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.