English | Telugu

అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న కమల్ కూతురు..!

కమల్ హాసన్ అంటే వైవిధ్యం. లోకనాయకుడని, సకలకళావల్లభుడని కమల్ కు పేరుంది. ఆయన కూతుళ్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఏదో ఒక రంగానికే పరిమితమైపోకుండా, అన్ని రంగాల్లోనూ ఒక అడుగు పెట్టడం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది కమల్ ఇద్దరి కూతుళ్లకి. ఇప్పటికే శృతి హాసన్ సింగర్ గా, నటిగా తనలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించుకుంది. ఇప్పుడు కమల్ చిన్న కూతురు అక్షర వంతొచ్చింది. నటిగా షమితాబ్ లో ఫర్లేదనిపించుకున్న అక్షర, కమల్ లేటెస్ట్ సినిమా శభాష్ నాయుడుకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయబోతోంది. ఈ సినిమా డైరెక్టర్ రాజీవ్ కుమార్ కు అసిస్టెంట్ గా అక్షర జాయిన్ అయింది. అంటే కమల్ తన ప్రొఫెషన్ లో తొలిసారి ఇద్దరు కూతుళ్లతో కలిసి వర్క్ చేయబోతున్నారనమాట. మల్టీ ట్యాలెంట్ చూపించడంలో తండ్రికి ఏ మాత్రం తగ్గరని నిరూపించుకుంటున్నారు శృతి, అక్షర. శభాష్ నాయుడు మే 16 నుంచి షూటింగ్ మొదలెట్టనుంది. చాలా కాలం తర్వాత కమల్ ఇళయరాజా కాంబోలో వస్తున్న సినిమా కావడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.