English | Telugu

రజనీ ' కబాలీ ' అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజైంది..!

చాలా కాలంగా ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ఉన్న సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్ కు ఈరోజు, రేపు రజనీ నుంచి బహుమతులు రెడీగా ఉన్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ కబాలీ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక థ్రిల్లింగ్ లుక్ ను ఈ రోజు మూవీ టీం రిలీజ్ చేశారు. అంత కంటే స్పెషల్ గా, రేపు కబాలీ టీజర్ ను విడుదల చేయబోతున్నారు రజనీ అండ్ కో. టీజర్ కు సంబంధించిన ఫోటోనే ఫస్ట్ లుక్ గా కూడా రిలీజ్ చేశారని సమాచారం. ఇప్పటికే మూవీ షూటింగ్ టైం లో తీసిన ఫోటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మే 1న కబాలీ టీం అఫీషియల్ గా రిలీజ్ చేసే టీజర్ ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కబాలీ ఒక స్టైలిష్ డాన్ కథ. ఇది బాషా 2 అని చాలా మంది అంటున్నప్పటికీ, మూవీ టీం నోరు మెదపట్లేదు. రజనీకి జంటగా రాధికా ఆప్టే నటించింది. ఈ భారీ బడ్జెట్ మూవీని కలైపులి ఎస్ థాను ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.