English | Telugu

పెద్దాయ‌న డైరెక్ష‌న్ చేస్తాడా?

నిర్మాణ రంగంలో దశాబ్దాల అనుభ‌వం సొంతం చేసుకొన్నారు కె.ఎస్‌.రామారావు. అభిలాష‌, మాతృదేవోభ‌వ‌, చంటి... ఇలా సినిమా పేర్లు చెబితే చాలు, ఆయ‌న అభిరుచి ఏమిటో అర్థ‌మైపోతుంది. తాజాగా మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అన్న‌ట్టు ఈ పెద్దాయ‌న‌కు డైరెక్ష‌న్‌మీద బాగా మ‌క్కువ ఉన్న‌ట్టుంది. ల‌వ్ గురు అనే కాన్సెప్టుతో నిత్య‌మీన‌న్‌కి ఓ క‌థ వినిపించార‌ట అప్ప‌ట్లో. అయితే ఆ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చలేదు. కాక‌పోతే ఎప్ప‌టికైనా మెగా ఫోన్‌ప‌ట్టుకొని కెప్టెన్ కుర్చీలో కూర్చోవాల‌న్న ఆశ మాత్రం ఉంది. త్వ‌ర‌లోనే ఆయ‌న నుంచి ద‌ర్శ‌క‌త్వం క‌బురు వ‌స్తే, ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ద‌ర్శ‌కులు నిర్మాత‌లుగా మార‌డం, నిర్మాత‌లు అప్పుడ‌ప్పుడూ కెప్టెన్ కుర్చీలో కూర్చోవ‌డం మామూలే. అయితే ద‌శాబ్దాల అనుభ‌వం త‌ర‌వాత.. కెప్టెన్ అవ్వ‌డం కొత్త‌గా అనిపిస్తోంది. మ‌రి కె.ఎస్‌.రామారావు డైరెక్ట‌ర్ గా డెబ్యూ ఎప్పుడు చేస్తారో చూడాల్సిందే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.