English | Telugu

శ్వేతాబ‌సు క‌థే... జ్యోతిల‌క్ష్మి?

టాలీవుడ్‌లో శ్వేతాబ‌సు ప్ర‌సాద్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించింది. క‌థానాయిక‌ల చీక‌టి భాగోతాల‌ను బ‌య‌ట‌పెట్టిన ఉదంతం అది. శ్వేత‌పై జాలిచూపిన‌వాళ్లు కొంద‌రైతే - ఆమె క‌థ‌ని క్యాష్ చేసుకొనేవాళ్లు మ‌రికొంద‌రు. ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ ఆ ప్ర‌య‌త్న‌మే చేస్తున్న‌ట్టు టాక్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జ్యోతిల‌క్ష్మి. ఛార్మి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ క‌థ కూడా చీక‌టి బాగోతాల వ్య‌ధేన‌ట‌. ముఖ్యంగా శ్వేతాబ‌సు ప్ర‌సాద్ ఉదంతం చుట్టూ పూరి ఈ క‌థ న‌డుపుతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. నిర్మాత సి.కల్యాణ్ ఇస్తున్న స్టేట్‌మెంట్లూ ఈవాద‌న‌ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. ''ఇటీవ‌ల టాలీవుడ్‌లో జ‌రిగిన ఓ సంచ‌న‌ల‌నాత్మ‌క వ్య‌వ‌హారాన్ని పూరి త‌న‌దైన కోణంలో ఆవిష్క‌రిస్తాడు'' అంటున్నారాయ‌న‌. దాన్ని బ‌ట్టి అది శ్వేతాబ‌సు మేట‌రే అన్న అనుమానం క‌లుగుతోంది. మ‌రి పూరి జ్యోతిల‌క్ష్మి డీల్ చేసే ఆ డేంజ‌రెస్ పాయింటేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.