English | Telugu

త్రీడిలో జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)స్టార్ హీరోయిన్ శ్రీదేవి(Sridevi)జంటగా నటించిన చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి(Jagadeka Veerudu Athiloka Sundari). సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని వైజయంతి మూవీస్ పై అగ్ర నిర్మాత అశ్వనీదత్(Aswani Dutt)భారీ వ్యయంతో నిర్మించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendrarao)తెరకెక్కించాడు. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటిని పక్కకి జరిపి సరికొత్త రికార్డులని కూడా నమోదు చేసింది. తుఫాన్ ని సైతం లెక్క చెయ్యకుండా థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్స్ తో రన్ అయ్యాయంటే ఈ మూవీ సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు.

1990 మే 9 న రిలీజైన జగదేకవీరుడు అతిలోకసుందరి వచ్చే నెల మే 9 కి ప్రేక్షకుల ముందుకు వచ్చి 35 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జగదేక వీరుడుని మే 9 న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని వైజయంతి సంస్థ అధికారకంగా ప్రకటించింది. అభిమానులు, ప్రేక్షకులకి మరింత థ్రిల్ ని కలిగించేలా అధునాతన టెక్నాలజీతో మెరుగులు దిద్ది 2d వెర్షన్ తో పాటు 3d వెర్షన్ లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

అమ్రిష్ పూరి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, బేబీ షామిలి, బేబీ షాలిని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ఇళయరాజా(Ilaiyaraaja)అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. నేటికీ ఆయా పాటలు మారుమోగిపోతూనే ఉంటాయి.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.