English | Telugu
‘ఇండియన్ 2’పై శంకర్ క్రేజీ అప్డేట్
Updated : Oct 29, 2023
యూనివర్సల్ స్టార్ కమల్హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2’. 1996లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్గా రానుంది. ఎన్నో కష్టాలను భరించి సాధించిన స్వతంత్ర భారతదేశంలో లంచగొండితనం వల్ల జరుగుతున్న అనర్థాలపై ఓ వయసు మళ్లిన సేనాపతి చేసిన పోరాటమే ఆ చిత్రం. దానికి కొనసాగింపుగా ‘ఇండియన్ 2’ వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. అంటే 28 ఏళ్ల తర్వాత మరోసారి సేనాపతి సిల్వర్ స్క్రీన్పై సంచలనాన్ని సృష్టించటానికి రెడీ అవుతున్నాడు.
‘ఇండియన్’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ‘ఇండియన్ 2’పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయనటంలో సందేహం లేదు. దీంతో మేకర్స్, శంకర్ ఆ అంచనాలను మించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఒకటి రెండు పోస్టర్స్ మినహా మరేమీ అప్డేట్ రాలేదు. అభిమానులు, ట్రేడ్ వర్గాలు అసలు ‘ఇండియన్ 2’లో సేనాపతి ఎలా ఉండబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు శంకర్ సైడ్ నుంచి సమాధానం దొరికేసింది. నవంబర్ 3న ‘ఇండియన్ 2’ ఇంట్రో గ్లింప్స్ రూపంలో ఉంటుందని శంకర్ తెలిపారు.
‘ఇండియన్ 2’లో భారీ తారాగణం కూడా ఉంటుంది. కమల్ హాసన్తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా కాజల్ గతంలో చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు.