English | Telugu

క్రైస్తవ ప్రపంచానికి హృతిక్ క్షమాపణలు

క్రైస్తవ ప్రపంచానికి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పారు. కొద్ది రోజుల క్రితం మాజీ ప్రేయసి కంగనా రనౌత్‌కు , హ‌ృతిక్ రోషన్‌కి మధ్య సోషల్ మీడియా సాక్షిగా మాటల యుద్ధం నడిచింది. ఈ సందర్భంలో కంగనా హ‌ృతిక్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఆమె ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ క్రైస్తవులు దైవంలా భావించే పోప్ పట్ల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. "మీడియా పేర్కొంటున్న అందమైన మహిళల కన్నా నాకు పోప్‌తో ఎఫైర్ కలిగి ఉండే అవకాశాలే ఎక్కువ" అంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై క్రైస్తవ సమాజం మండిపడింది. తమ మతాధిపతిని అవమానించడం ద్వారా క్రైస్తవుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అధ్యక్షుడు అబ్రహం మథాయ్ సెక్షన్ 295ఏ కింద హ‌ృతిక్‌కు నోటీసులు పంపారు. పోప్‌కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామిగా ఎవరినైనా ఎంచుకునే హక్కు హృతిక్‌కు ఉందని కానీ ఇలా పోప్ పేరుని వాడుకొని మతాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడితే సహించబోమన్నారు. దీనిపై స్పందించిన హృతిక్ తాను పోప్‌పై చేసిన వ్యాఖ్యలు ఉద్ధేశ్యపూర్వకంగా చేసినవి కావన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.