English | Telugu

ప్రభాస్ కు హెల్ప్ చేసిన సర్దార్ విలన్..!

సర్దార్ విలన్ గుర్తున్నాడా..? ట్రైలర్ చాలా సార్లు చూసిన వాళ్లందరికీ ఈ పాటికే అతని ఫేస్ నోట్ అయిపోయి ఉంటుంది. తాను కూడా పవన్ కు వీరాభిమానిని అంటున్న ఈ విలన్ పేరు శరద్ ఖేల్కర్. హిందీలో సీరియల్స్ తో పాటు, కొన్ని సినిమాలు కూడా చేసినా ఇతనికి బ్రేక్ రాలేదు. కానీ ప్రభాస్ కు చేసిన ఒక సాయం, లైఫ్ ను టర్న్ చేసింది. బాహుబలి హిందీలో కూడా రిలీజైన విషయం మీకు తెలుసు కదా..మరి హిందీలో ప్రభాస్ కు వాయిస్ ఎవరు చెప్పి ఉంటారబ్బా అని డౌట్ రాలేదా..? ఒక వేళ ఆ డౌట్ వస్తే, దానికి జవాబు శరద్ ఖేల్కర్. ఇతని గొంతును సీరియల్స్ లో విన్న హిందీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్లో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పమని అడిగారట. వెంటనే ఎగిరి గంతేసి మరీ శరద్ సై అన్నాడు. ఆ డబ్బింగ్ తర్వాతే టాలీవుడ్ దృష్టిలో పడ్డాడు. సర్దార్ లో విలన్ పాత్రకు కొత్త ముఖాన్ని వెతుకుతున్న బాబీ అండ్ కో, వెంటనే శరద్ ను సినిమాలో విలన్ గా ఫిక్స్ చేసేశారు. ఇప్పటికే ట్రైలర్లో మనోడి విశ్వరూపం చూపించాడు. సర్దార్ తో తనకు బ్రేక్ రావాలని, అన్ని భాషల్లోనూ బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాడీ హిందీ బాహుబలి. సర్దార్ లో పెర్ఫామెన్స్ ఎలా ఇచ్చాడో తెలియాలంటే మాత్రం, ఏప్రిల్ 8 వరకూ వెయిట్ చేయాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.