English | Telugu

నేను అందరివాడిని: శ్రీకాంత్

హీరో శ్రీకాంత్ తానూ రాజకీయాలకు దూరం అని అంటున్నారు. ఈ మధ్య సినిమా నటులు అందరూ కూడా రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై శ్రీకాంత్ మాట్లాడుతూ... నాకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ మిత్రులున్నారు. కానీ రాజకీయాలంటే ఏ మాత్రం ఆసక్తి లేదు. ప్రచారం చేయమని కూడా ఎవరు నన్ను అడగరు. ఒకవేళ రాజకీయాల మీద ఆసక్తి ఉంటే చిరంజీవిగారు పార్టీ పెట్టినపుడే వెళ్ళేవాడిని. అయినా నేను అందరివాడిని. ఒక బాధ్యత గల పౌరునిగా ఓటు మాత్రం వేస్తాను అని అన్నారు. పవన్ జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని తెలియగానే మొదట షాకయ్యాను. ఆయన పార్టీ పెడతారని అస్సలు ఊహించలేదు. ఆయన ప్రసంగం ఆసక్తిగా అనిపించింది అని అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికి చిత్రపరిశ్రమపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రజలు తెలుగు సినిమాలను రెండు చోట్ల ఆదరిస్తారు అని తెలిపారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.