English | Telugu

తమిళంలో హిట్టు కథా చిత్రమ్....

తెలుగులో సక్సెస్‌ఫుల్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా అనేక చిత్రాలను నిర్మించింది. ఆ సినిమాల ద్వారా అనేక హిట్లు కూడా కొట్టిన చరిత్ర గీతా ఆర్ట్స్‌కి వుంది. అయితే ఇటీవలి కాలంలో తెలుగుమీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేసిన ఈ సంస్థ తమిళ సినిమా రంగానికి దూరంగా వుంటూ వచ్చింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ తమిళంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడం తెలుగులో విజయం సాధించిన ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాతో ఇచ్చింది. ఈ సినిమాని ‘డార్లింగ్’ పేరుతో రీమేక్ చేసింది. ఇందులో హీరో ఎవరో కాదు.. ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. ఈమధ్య విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా విజయం సాధించిందని తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చాక ఒక హిట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం గీతా ఆర్ట్స్ వర్గాలకు బోలెడంత సంతోషాన్ని కలిగిస్తోందని సమాచారం.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.