English | Telugu

ఆ నాలుగు సినిమాల్లో దీపావళి విన్నర్‌గా నిలిచే మూవీ ఏది?

టాలీవుడ్‌కి సెప్టెంబర్‌ నెల బాగా కలిసొచ్చింది. లిటిల్‌ హార్ట్స్‌, మిరాయ్‌, ఓజీ చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. మిరాయ్‌తోపాటు రిలీజ్‌ అయిన కిష్కింధపురి కూడా కలెక్షన్ల పరంగా ఫర్వాలేదు అనిపించింది. చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడుతున్నాయి. అక్టోబర్‌కి వచ్చేసరికి కాంతార చాప్టర్‌ 1 కలెక్షన్ల పరంపరను కొనసాగించింది. అయితే సెప్టెంబర్‌లో సక్సెస్‌ అయిన నాలుగు సినిమాలూ తెలుగు సినిమాలు కావడం విశేషం. అక్టోబర్‌కి వచ్చేసరికి కాంతార డబ్బింగ్‌ సినిమా. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ సినిమాకి పోటీగా నిలిచే సినిమా రెండో వారంలో లేకపోవడం కూడా కాంతారకు కలిసొచ్చింది.

మూడో వారంలో కొన్ని సినిమాలు వస్తున్నాయి. అక్టోబర్‌ 20 దీపావళి కావడంతో పండగను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అయితే ప్రధానంగా నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. 16న ‘మిత్రమండలి’, 17న ‘తెలుసు కదా’, ‘డ్యూడ్‌’, 18న ‘కె ర్యాంప్‌’ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల ట్రైలర్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలన్నీ యూత్‌ని టార్గెట్‌ చేస్తూ రూపొందిన సినిమాలు. పైగా పండగకి రిలీజ్‌ అవుతున్న సినిమాలు కావడంతో ఈ నెలలో కూడా థియేటర్లలో సందడి వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

అక్టోబర్‌ 16న విడుదలవుతున్న మిత్రమండలి చిత్రంలో ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌, సత్య, నిహారిక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక మంచి బజ్‌ వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ప్రేక్షకులు ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన తెలుసు కదా అక్టోబర్‌ 17న రిలీజ్‌ అవుతోంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే ఉంటుందని అర్థమవుతోంది. అదే రోజు ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా, మమిత బైజు హీరోయిన్‌గా రూపొందిన డ్యూడ్‌ చిత్రం కూడా విడుదలవుతోంది. గతంలో లవ్‌ టుడే, డ్రాగన్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రదీప్‌ నటించిన ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉంది.

ఇక 18న కిరణ్‌ అబ్బవరం కెర్యాంప్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా కూడా యూత్‌ని టార్గెట్‌ చేసి రూపొందించారు. ప్రజెంట్‌ జనరేషన్‌ కుర్రాళ్లకు కావాల్సిన కంటెంట్‌ అంతా ఈ సినిమాలో ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే దీపావళికి రిలీజ్‌ అవుతున్న నాలుగు సినిమాలూ ఒకే తరహాలో నాన్‌స్టాప్‌ కామెడీ మూవీస్‌గా కనిపిస్తున్నాయి. ఒకేసారి ఒకే తరహా సినిమాలు నాలుగు రావడం కూడా ఆడియన్స్‌లో కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. ఏ సినిమా ముందు చూడాలి అనే విషయంలో ఒక నిర్ణయానికి రావడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే ఈ నాలుగు సినిమాల్లో దీపావళి విన్నర్‌ ఎవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.