English | Telugu

హృతిక్ రోషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం



ముంబాయిలోని రితిక్ రోషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబాయి, లోకండ్ వాలా లింక్ రోడ్ లో గల లోటస్ బిజినెస్ పార్క్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుంది. 21 అంతస్తులో చెలరేగిన మంటలు వెనువెంటనే 20 అంతస్తుకి వ్యాపించాయి. ఈ భవన సముదాయంలో బాలీవుడ్ తారలు అనేక మంది బిజినెస్ కార్యాలయాలు కలవు. రితిక్ రోషన్, అజయ్ దేవగన్ తో పాటు మరికొంత మంది ప్రముఖుల ఆఫీసుల గల ఈ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించారు.


ప్రమాద విషయం తెలియగానే 12 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్ ని వినియోగించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ సంఘటలో ఒకరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.