English | Telugu

"దునియా" విజయోత్సవం

ఇన్ ఫొటెక్ పతాకంపై, అందరూ కొత్తవారితోనే కాకుండా యల్.కె.రావ్ అనే ఒక కొత్త దర్శకుణ్ణి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ, నూతన నిర్మాత శ్రీమతి గీతాశ్రీ నిర్మించిన దేశభక్తితో కూడిన ఎంటర్ టైన్ మెంట్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ "దునియా". ఈ "దునియా" చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర నిర్మాత శ్రీమతి గీతాశ్రీతో పాటు ఈ చిత్రం యూనిట్ ఈ చిత్రం సక్సస్ మీట్ లో పాల్గొన్నారు.

అనంతరం నిర్మాత శ్రీమతి గీతాశ్రీ ప్రసంగిస్తూ "అందరూ కొత్తవారి "దునియా" చిత్రాన్ని నిర్మించినా కూడా ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆదరిస్తున్నారు. నేను కొత్త నిర్మాతనైనా ఒక దేశభక్తి చిత్రాన్ని అందరికీ నచ్చేలా బాగా తీశానని నన్ను అందరూ అభినందిస్తున్నారు. మీడియా కూడా ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేయటం ఈ చిత్ర విజయానికి మూలకారణంగా నేను భావిస్తున్నాను" అని అన్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.