Read more!

English | Telugu

బన్నీ మీద దిల్ రాజు ప్రతీకారమా..?

దిల్ రాజు అంటే సక్సెస్ కు మారుపేరు. చిన్న మెకానిక్ షెడ్ స్థాయి నుంచి డిస్ట్రిబ్యూటర్ గా ఆ తర్వాత ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ది పిల్లర్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ప్రతీ రూపాయి ఆచి తూచి ఖర్చుపెడతాడని కూడా దిల్ రాజుకు పేరు. మరి అలాంటి దిల్ రాజు, కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ పై కృష్ణాష్టమి కోసం ఎందుకింత భారీ బడ్జెట్ పెట్టాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సినిమాలో కేవలం సునీల్ బట్టలకే 20 లక్షల వరకూ పెట్టారట. పోనీ సునీల్ కు భీభత్సమైన హిట్లేవన్నా వచ్చాయా అంటే అదీ లేదు. మర్యాద రామన్న ఓ మాదిరిగా ఆడింది తప్ప, నిజం చెప్పాలంటే సునీల్ హీరో కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. మరి దిల్ రాజు ప్లాన్ ఏంటి..?

ఆడియో ఫంక్షన్లో స్వయంగా సునీలే చెప్పాడు. దిల్ రాజు తన కొడుకును హీరోగా పెట్టి తీస్తే ఎంత ఖర్చు పెడతారో, అలా ఖర్చు చేశాడు అని. నిజానికి దిల్ రాజుకు కోపం పౌరుషం చాలా ఎక్కువే..అందుకే ప్రొడ్యూసర్ గా ఫ్లాప్ లు వచ్చినా, హిట్టు కోసం మరో భారీ సినిమాయే తీస్తాడు. కృష్ణాష్టమి కథ మొదటి అల్లు అర్జున్ కోసం ప్రిపేర్ చేయించాడు దిల్ రాజు. కానీ బన్నీకి ఆ కథ నచ్చలేదు. కొన్ని ఛేంజెస్ చేయించి వినిపించినా, బన్నీ వద్నన్నాడట.. దీంతో అల్లు అర్జున్ కాదన్న ఇదే కథను సునీల్ తో తీసి హిట్టు కొడదామని దిల్ రాజు ఫిక్సయాడనేది సమాచారం. ఒక రకంగా బన్నీపై ప్రతీకారానికే కృష్ణాష్టమిని అంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని నిర్మించాడట. సునీల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ గా తెరకెక్కిన కృష్ణాష్టమి ఫిబ్రవరి 19న రిలీజ్ కానుంది. వాసువర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సునీల్ సరసన డింపుల్ చోపడే, నిక్కీ గల్రానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.