English | Telugu

యాక్సిడెంట్ కి గురైన ఆశిష్ విద్యార్థి.. భార్యకి ఎలా ఉంది

ఆశిష్ విద్యార్థి యాక్సిడెంట్ కి గురవడానికి కారణం ఏంటి!
చేసింది వాళ్లేనా!
యాక్సిడెంట్ సమయంలో ఎవరెవరు ఉన్నారు
భార్య రూపాలి పరిస్థితి ఎలా ఉంది!
అభిమానుల ఆందోళన


పర బాషా నటుడైనా తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో తెలుగు వారి అభిమాన నటుడుగా మారిన వాళ్ళల్లో ఆశిష్ విద్యార్థి ఒకరు. పైగా రెండున్నర దశాబ్దాల తెలుగు సినీ ప్రస్థానం అంటే ఆశిష్ విద్యార్థికి యాక్టింగ్ కి ఉన్న క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషించినా కూడా నెగిటివ్ షేడ్ ఉన్న వాటిల్లో ఆయన పండించే విలనిజం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఈ రోజు ఆశిష్ విద్యార్థి యాక్సిడెంట్ కి గురయ్యారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అసలు విషయం చూద్దాం.

ఆశిష్ విద్యార్థి ఈ రోజు ఉదయం అస్సాం లోని గౌహతి లో తన భార్య రూపాలి తో కలిసి రోడ్ దాటుతున్నాడు. కానీ అకస్మాత్తుగా ఒక బైక్ వచ్చి ఆ ఇద్దర్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కింద పడిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులని హాస్పిటల్ లో జాయిన్ చేసారు.ఇక ఈ యాక్సిడెంట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆశిష్ విద్యార్థి ఆరోగ్యంపై ఆందోళన చెందారు. దీంతో ఆశిష్ విద్యార్థి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు అభిమానులతో పాటు ఎవరు ఆందోళన చెందవద్దు. నాకు స్వల్ప గాయాలయ్యాయి. నా భార్యని ఇంకా అబ్జర్వేషన్ లో ఉంచారని వెల్లడి చేసాడు.

Also Read:పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి! అసలు ఏమైంది!

పోకిరి, అదుర్స్, నాయక్, ఛత్రపతి, బాద్ షా, ఆగడు,చిరుత, జనతా గారేజ్, గోపాల గోపాల ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు యాభైకి కి పైగా చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.2023 లో వచ్చిన రైటర్ పద్మభూషణ్ చిత్రంలో చివరగా కనిపించాడు. హిందీలో నలభై చిత్రాల వరకు, తమిళ, మలయాళ,కన్నడ, బెంగాలీ కలిపి సుమారు 60 చిత్రాల వరకు చేసాడు. స్వస్థలం ఢిల్లీ కాగా రూపాలి రెండో భార్య. తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి 2023 లో పెళ్లి చేసుకున్నాడు.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.