English | Telugu

జగపతిబాబుపై దాడి చేసిన డెవిల్‌, యానిమల్‌.. తర్వాత ఏం జరిగి ఉంటుంది?

సినిమా ఇండస్ట్రీలో ఎవరి కెరీర్‌ ఎలా టర్న్‌ తీసుకుంటుందనే విషయం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే విలన్‌గా ఎంట్రీ ఇచ్చినవారు ఆ తర్వాత స్టార్‌ హీరో అయిపోతారు. కొందరు విలన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి ఆ తర్వాత విలన్‌గా మారిపోతారు. ఇక నటులు డైరెక్టర్‌ అయిపోవడం, మ్యూజిక్‌ డైరెక్టర్లు హీరోలుగా మారడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా బుద్ధిమంతుడు క్యారెక్టర్స్‌ చేస్తూ వచ్చిన జగపతిబాబు.. సడన్‌గా యాక్షన్‌ సినిమాల వైపు టర్న్‌ తీసుకొని గాయం, అంత:పురం వంటి సినిమాల్లో తనలోని అదర్‌ యాంగిల్‌ కూడా చూపించారు. ఆ తర్వాత కూడా హీరోగానే కొనసాగిన జగ్గుభాయ్‌... లెజెండ్‌ సినిమాతో పవర్‌ఫుల్‌ విలన్‌గా అవతరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు.

ఇప్పుడు బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ సెలబ్రిటీలతో కలిసి సందడి చేస్తున్నారు జగపతిబాబు. ఈ టాక్‌ షోను అక్కినేని నాగార్జునతో స్టార్ట్‌ చేశారు. ఈ షోలో ఇద్దరూ ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. అలాగే హీరోయిన్‌ శ్రీలీల, నాని కూడా ఈ షోలో పాల్గొన్నారు. సరదాగా నడిచే ఈ షోలో ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే ఎన్నో విషయాలను సెలబ్రిటీల నుంచి రాబడుతున్నారు జగపతిబాబు. తాజాగా ఈ షోకు ఒక డెవిల్‌, ఒక యానిమల్‌ వచ్చి అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది జీ తెలుగు.

ప్రేక్షకులను భయపెట్టడమే తన లక్ష్యం అని తొలి సినిమా నుంచే చెప్తూ వస్తున్న రామ్‌గోపాల్‌వర్మ.. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేసి టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. మధ్య మధ్య దెయ్యాలకు సంబంధించిన సినిమాలు చేసినా అతను అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయారు. అయినా ఎప్పటికైనా డెవిల్‌ సినిమాలతో ప్రేక్షకుల్ని భయపెడతానని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు వర్మ. ఇక అర్జున్‌రెడ్డి వంటి వయొలెంట్‌ లవ్‌స్టోరీని తెరకెక్కించి తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సందీప్‌రెడ్డి వంగా.. యానిమల్‌ చిత్రంతో ఎక్స్‌ట్రీమ్‌ లెవల్‌కి వెళ్లిపోయాడు. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్‌ చిత్రాన్ని చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది.

ఇదిలా ఉంటే.. విభిన్నమైన ఐడియాలజీ ఉన్న ఇద్దరు దర్శకులు ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయం ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే జయమ్ము నిశ్చయమ్మురా టాక్‌ షోలో తెలుస్తుంది. రిలీజ్‌ అయిన ప్రోమోలోని విజువల్స్‌ చూస్తే.. షో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. సెప్టెంబర్‌ 7 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ఈ టాక్‌ షో ప్రసారం కానుంది. ‘లెజెండ్‌’ చిత్రంలో హీరోగా నటించిన నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ షోతో ఆకట్టుకుంటూ ఉంటే.. అందులో విలన్‌గా నటించిన జగపతిబాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.