English | Telugu

లింగ సమానత్వ రాయబారిగా కృతి సనన్.. హీరోని ఆ మాట అడిగే దైర్యం ఉందా!

సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu),సుకుమార్(Sukumar)కాంబినేషన్ లో తెరకెక్కిన '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి 'కృతి సనన్'. ఆ తర్వాత 'హీరోపంత్' అనే మూవీతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ హిట్ మూవీస్ లో ఒకటైన 'పరుగు' కి రీమేక్ గా ఆ చిత్రం తెరకెక్కింది. ఆ తర్వాత వరుసగా పలు విభిన్న చిత్రాల్లో చేస్తు, తన అద్భుతమైన నటనతో అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ 'ఆదిపురుష్' లో 'సీతమ్మ తల్లి' గా చేసి భారతీయ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. నిర్మాతగాను సత్తా చాటుతున్న కృతి సనన్ రీసెంట్ గా 'ఇక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియా'(Unfpa)కి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపిక అయ్యింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఇండస్ట్రీలో హీరోకి లభించే సౌకర్యాలు హీరోయిన్ కి లభించవు. సౌకర్యాల్లోనే కాదు గౌరవించడంలోను తేడా ఉంది. హీరోలకి పెద్ద పెద్ద కార్లు, రూమ్స్ కేటాయిస్తారు. మాకు మాత్రం అలా ఉండవు. ఇలా ఎందుకు చేస్తారని చాలా సార్లు బాధపడ్డాను. షూటింగ్ టైంలో హీరో కంటే ముందే సెట్ కి వచ్చి వెయిట్ చేస్తుండాలి. ఒక వేళ మేము సెట్ కి లేట్ గా వస్తే ఒప్పుకోరు .హీరోలు లేట్ గా వచ్చినా వాళ్ళని అడిగే దైర్యం చెయ్యరు. మా అమ్మ 'లింగ వివక్ష'ని దాటుకొని నాకు నా సోదరికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చి పెంచింది. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని కృతి సనన్ చెప్పుకొచ్చింది.

ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియా ప్రధాన కార్యాలయం 'న్యూయార్క్'(New York)లో ఉంది. ప్రధానంగా లింగ సమానవత్వాన్ని పెంపొందించడమే ఆ సంస్థ ప్రధాన లక్ష్యం. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి, తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బాల్య వివాహం , లింగ ఆధారిత హింస, ప్రసూతితో పాటు, స్త్రీ కి సంబందించిన అనేక సమస్యలపై ఎవెర్ నెస్ తీసుకురానుంది. సినిమాల పరంగా చూసుకుంటే కృతి సనన్ గత ఏడాది 'దోపత్తి' అనే వెబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రస్తుతం 'తేరే ఇష్క్ మెయిన్' తో పాటు 'కాక్ టైల్ పార్ట్ 2 ' చిత్రాల్లో చేస్తుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.