English | Telugu

చిరు ఇంటికెళ్లిన పవన్

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా, అది ట్రెండింగ్ టాపిక్స్ లో టాప్ లో కూర్చుంటోంది. పవన్ స్టామినా రోజురోజుకూ పెరిగిపోతోందంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఒకప్పుడు మెగాస్టార్ కు ఇదే రేంజ్ స్టార్ డం ఉండేది. ఆయన కోసం జనం పిచ్చెక్కిపోయేవారు. దాదాపు అన్ని హీరోల ఫ్యాన్స్, చిరంజీవిని కూడా అభిమానించేవారు. ప్రస్తుతం మెగా స్థానంలోకి పవర్ స్టార్ రీచ్ అయ్యారని చెప్పచ్చు. ఇలాంటి ఇద్దరు స్టార్స్ కలిసి ఉంటే, ఇండస్ట్రీకి కూడా మంచిదే. ఈ ఒపీనియన్ తోనే ఇద్దరికీ మధ్య మనస్పర్ధలేవీ లేవని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారీ అన్నదమ్ములు.

బ్రూస్ లీ కోసం పవన్ చిరును కలిశారు. సర్దార్ సెట్స్ లో పనిగట్టుకుని వచ్చి చిరు సందడి చేశారు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ మళ్లీ చిరును కలిశారని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. సర్దార్ ఆడియోకు ముఖ్యఅతిథిగా రావాలని పవన్ చిరును ఆహ్వానించారనే టాక్ నడుస్తోంది. దీంతో చిరు ఆడియోకు రావడం కన్ఫామ్ లాగే కనిపిస్తోంది. చివరిగా మెగాబ్రదర్స్ కలిసి కనబడిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ ను దుమ్ము దులిపేసింది. మరి సర్దార్ కు కూడా అన్నయ్య వచ్చాడంటే, మళ్లీ తమ్ముడి సినిమా ఊపు ఊపబోతుందా..? ఒకవేళ సెంటిమెంట్ వర్కవట్ అయితే బాక్సాఫీస్ కు పూనకం రావాలి మరి..చూద్దాం

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.