English | Telugu

వెంకీ 75వ సినిమాకు డైరెక్టర్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో సీనియర్లంతా మైల్ స్టోన్ మూవీస్‌తో బిజీగా బిజీగా ఉంటున్నారు. చిరంజీవి 150..బాలయ్య 100వ సినిమాలకు ఇప్పటికే కొబ్బరికాయ కొట్టేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి వెంకటేశ్ వచ్చారు. మూడు దశాబ్దాలుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు తెరపై క్లాస్ కమ్ మాస్ హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రజంట్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న బాబు బంగారం వెంకటేశ్ కెరీర్‌లో 73వ చిత్రం. ఈ సినిమా పూర్తయిన వెంటనే కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. వాటన్నింటి కంటే ముందు తన 75వ చిత్రంపై వెంకీ ఫోకస్ చేశాడు. ఈ సినిమాకు దర్శకుడు, స్క్రిప్ట్, నటీనటులు, టెక్నికల్ టీం విషయమై ఇప్పటి నుంచే భారీ కసరత్తు చేస్తున్నాడట. మొన్నామధ్య డైరెక్టర్ పూరీ చెప్పిన స్టోరీ లైన్ వెంకీకి బాగా నచ్చిందట. దీంతో వెంకీ తన 75వ సినిమాను పూరీకే అప్పగించాడని ఫిల్మ్ నగర్‌ టాక్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.