English | Telugu

రూ.5 కోట్ల పారితోషికంతో ఛార్మి సంచ‌ల‌నం!

తెలివంటే ఛార్మిదే. పైసా పారితోషికం తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేసింది. నిర్మాత అనే హోదా అనుభ‌వించింది. ఇప్పుడు ఆ సినిమాకి గానూ రూ.5 కోట్ల పారితోషికం అందుకొని ఓ స‌రికొత్త సంచ‌లం సృష్టించింది. పూరి - ఛార్మిల కాంబినేష‌న్లో రూపుదిద్దుకొన్న సినిమా జ్యోతిల‌క్ష్మి.

ఈసినిమాకి ఛార్మి పైసా పారితోషికం తీసుకోకుండా భాగ‌స్వామిగా చేరిపోయింది. అటు పూరి కూడా ఫ్రీగానే చేశాడు. ఎందుకంటే ఈ సినిమాలో త‌న‌కూ వాటా ఉంది. ఈ సినిమాలో ఛార్మి త‌ప్ప మ‌రో స్టార్ ఎవ‌రూ లేరు. అందుకే ఈ సినిమాని అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో పూర్తి చేయ‌గ‌లిగాడు పూరి. ఇప్పుడు ఈ సినిమాని మొత్తంగా రూ.15 కోట్ల‌కు అమ్మేశార‌ట‌. అంటే ఛార్మి త‌న వాటాగా రూ.5 కోట్లు ద‌క్కించుకొంద‌న్న‌మాట‌.

ఈ ఉత్సాహంతో జ్యోతిల‌క్ష్మీ 2 కూడా చేసేయ‌డానికి ఛార్మి రెడీ అయిపోతోంది. రూ.5 కోట్ల పారితోషికం వ‌స్తే ఎవ‌రు ఆగుతారు. కాక‌పోతే పూరినే ఖాళీగా లేడు. ఛార్మితో జ్యోతిల‌క్ష్మి 2 తీయాలంటే మూడేళ్ల‌యినా ప‌డుతుంది. పూరి అంత బిజీ మ‌రి. అయితే జ్యోతిల‌క్ష్మితో అత్య‌ధిక పారితోషికం అందుకొన్న క‌థానాయిక‌గా ఛార్మి రికార్డ్ సృష్టించిన‌ట్టే. మిగిలిన హీరోయిన్లంతా ఈ ఫార్ములా పాటిస్తే... బాగుంటుందేమో.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.