English | Telugu

పూరీ ఆగలేకపోతున్నాడట..!!

ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌ల కొడుకుల టార్గెట్‌ కూడా హీరో కావడమే. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కొడుకు పూరి ఆకాశ్‌ హీరో అవుతాడని చిన్నప్పుడే తేలిపోయింది. బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించిన ఆకాశ్‌.. మధ్యలో ‘ధోని’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేశాడు.

ఇప్పుడు అతను కథానాయకుడిగా ‘ఆంధ్రా పోరి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు కొడుకు సినిమా చూడలేకపోయిన పూరి.. రెండో రోజు థియేటర్‌కే కొడుకు నట విన్యాసాలు చూశాడట. నా కొడుకు అదరగొట్టేశాడంటూ ఆనందంగా చెబుతున్నాడు పూరి.

"ఆంధ్రాపోరి మరాఠీ మాతృక చూసినపుడు అందులో కథానాయకుడు చాలా బాగా చేశాడని.. అంతకంటే బాగా చేయాలని ఆకాశ్‌కు చెప్పా. ఐతే ఆంధ్రాపోరిలో ఆకాశ్‌ నటన చాలా సంతృప్తికరంగా అనిపించింది. క్లైమాక్స్‌ సీన్‌లో ఆకాశ్‌ చాలా మంచి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. నిజానికి ఆకాశ్‌ను మూడేళ్ల తర్వాత హీరోగా ఇంట్రడ్యూస్‌ చేద్దామనుకున్నా. కానీ ఈ సినిమా చూశాక అర్జెంటుగా అతడు హీరోగా సినిమా చేయాలనిపిస్తోంది. ఆంధ్రాపోరి మంచి లవ్‌స్టోరీ రాజ్‌ మాదిరాజు చాలా బాగా తీశాడు. మంచి మెసేజ్‌ కూడా ఇచ్చాడు” అని చెప్పాడు పూరి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.