English | Telugu

నితిన్ ప‌రువు తీసిన ఛార్మి

నితిన్ - పూరి జ‌గ‌న్నాథ్ సినిమా ఆగిపోవ‌డంతో ఇండ్ర‌స్ట్రీ షాకయ్యింది. రెండ్రోజుల్లో సినిమా మొద‌ల‌వుతుంది అనుకొంటే ఈలోగా క్యాన్సిల్ అయిన‌ట్టు అటు పూరి, ఇటు నితిన్ ఇద్ద‌రూ ప్ర‌క‌టించేశారు. ఈ ప్రాజెక్టులో ఛార్మి ఎంట‌ర్ అవ్వ‌డంతోనే సినిమా ఆగిపోయింద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. జ్యోతిల‌క్ష్మికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది ఛార్మి. నితిన్ సినిమాకీ ఛార్మినే ప్రొడ‌క్ష‌న్ చూసుకొంటుంద‌ని పూరి సెల‌విచ్చాడ‌ట‌. ప్ర‌పోజ‌ల్ న‌చ్చ‌క నితిన్ ఈ సినిమాకి నో చెప్పాడ‌ని చెప్పుకొన్నారు. అయితే ఈ వ్య‌వ‌హారంపై ఛార్మి స్పందించింది.

ఆ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం నేను కాదు. నితిన్ సంస్థ శ్రేష్ట్ మీడియా ద‌గ్గ‌రే డబ్బుల్లేవ్‌ అని బ‌య‌ట చెబుతోంద‌ట ఛార్మి. ప్ర‌స్తుతం శ్రేష్ట్ మీడియా అఖిల్‌తో ఓ సినిమా చేస్తోంది. దీనికి వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. త‌మ సొమ్మంతా ఈసినిమాపైనే పెట్టుబ‌డి పెట్టార‌ని, అందుకే పూరి సినిమా చేయ‌లేక‌పోతున్నార‌ని ఛార్మి త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెబుతోంద‌ట‌. అయితే అంద‌రూ నిజం తెలుసుకోకుండా త‌న‌ని నిందిస్తున్నార‌ని వాపోతోంద‌ట‌.

నితిన్ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవంటే ఇది న‌మ్మాలా..?? ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో భారీ లాభాలు సంపాదించాడు నితిన్‌. చిన్న‌దాన నీ కోసం ఫ్లాప్ అయినా... నితిన్ న‌ష్ట‌పోయిందేం లేదు. మ‌రి ఛార్మి ఈ కామెంట్లు ఎందుకు చేసిందో, ఏంటో?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.