English | Telugu

కళాభవన్ మణి ఇక లేరు..

విలక్షణ నటుడు కళాభవన్ మణి కన్నుమూవారు. గత కొంతకాలంగా ఆయన లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మణి, సల్లాపం అనే సినిమాలోని తన పాత్రకు మంచి పేరు రావడంతో, ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. తెలుగులో జెమినీ సినిమాలో లడ్డా పాత్రతో తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే పాత్ర చేశారు కళాభవన్ మణి. కేవలం ఒక కమెడియన్ గా, రంగస్థల నటుడిగానే కాక, జానపద పాటలు పాడటంలో కూడా మణికి మంచి పేరుంది.

చివరిగా తెలుగు ప్రేక్షకులు ఆయన్ను రోబో సినిమాలో చిన్న పాత్రలో చూశారు. విలనిజానికి కామెడీని మిక్స్ చేసి, నటించడంలో కళాభవన్ మణిది చాలా విలక్షణమైన శైలి. కాగా నటుడు కాకముందు, మణి ఆటోడ్రైవర్ గా చేసేవారు. ఆ స్థాయి నుంచి తనను దక్షిణ భారతదేశమంతా గుర్తించగలిగే స్థాయికి ఎదిగారు. గత కొన్నేళ్లుగా ఆయన్ను లివర్, కిడ్నీ సమస్యలు వేధిస్తుండటంతో కొచ్చిలోని హాస్పటల్లో చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి 7.15 నిముషాల సమయంలో తుదిశ్వాస విడిచారు మణి. ఆయన మరణంపై తమిళ తెలుగు చిత్రసీమలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.