English | Telugu

'బాహుబలి' అట్టర్ ఫ్లాప్..!!

వెండితెపై అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన బాహుబలి..బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికలపడింది. బహుబలిని థియేటర్లలో చూసేందుకు ఎగబడి టికెట్లు కొన్న జనాలు టీవిలో చూడడానికి మాత్రం.. ఏమాత్రం ఆసక్తి చూపలేకపోయారు. దీనికి ప్రధాన కారణం.. బాహుబలి సినిమా ప్రతి 10 నిమిషాల షోకి మరో 15 నిమిషాల ఇంటర్వ్యూ ఎపిసోడ్ లు - ఎడ్వర్ టైజ్ మెంట్లు లైవ్ చేయడమే అని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి బాహుబలి బుల్లితెరపై మగధీర కంటే తక్కువ స్థాయిలోనే నిలిచింది. మగధీర టీఆర్ పీ 22.7 కాగా బాహుబలికి టీఆర్ పి 21.8 పాయింట్లు దక్కించుకుంది. ఇక ఈ ఏడాది టాప్-5 మూవీస్ విషయానికొస్తే.. బాహుబలిదే టాప్ ప్లేస్!

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.