English | Telugu

మహాబలిపురంలో 'బాహుబలి'

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి మూవీ యుద్ధ స‌న్నివేశాల చిత్రకరణ పూర్తయినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా రామోజీ ఫిల్మ్ సిటీలో విశ్రాంతి లేకుండా భీక‌ర యుద్ద స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు రాజమౌళి. టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లు ఈ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాల కోసం బాహుబలి యూనిట్ చెన్నయ్ సమీపంలోని మహా బలిపురం ప్రాంతానికి తరలి వెళ్లనుంది. మహాబలిపురం దగ్గర సముద్రం, శిల్పాలు అన్నీ వుండడంతో అక్కడ 15 రోజులు పాటు సినిమా చిత్రీకరణ జరపనున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ ఆస‌క్తి నెల‌కొంది. మొత్తానికి రాజ‌మౌళి, బాహుబ‌లి మూవీతో టాలీవుడ్ రేంజ్‌ను మ‌రో మెట్టు ముందుకు తీసుకువెళ‌తాడు అని అంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.