English | Telugu

రుద్రమదేవి మిస్..అనుష్క ఫిక్స్..!!

ఫిల్మ్ లవర్స్ కి షాకింగ్ న్యూస్. అనుష్క నటించిన చారిత్రాత్మక మూవీ రుద్రమదేవి మళ్ళీ వాయిదా పడింది. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం రుద్రమదేవి అక్టోబర్ 9న రిలీజ్ కావడం లేదట. గత కొన్ని నెలలుగా రుద్రమదేవి సినిమా వాయిదాకి 3D గ్రాఫిక్స్ కారణంగా చెబుతున్న గుణశేఖర్ ..అసలు కారణం మాత్రం బయటకు చెప్పడం లేదు.

అయితే ఈ సినిమా రిలీజ్ కి 3D గ్రాఫిక్స్ కారణం కాదని..ఫైన్యాన్షియాల్ ప్రాబ్లంస్ ముఖ్య కారణమని అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది మాత్రం గుణశేఖర్ త్వరలో రీవిల్ చేస్తారట. రుద్రమదేవి సినిమా వాయిదా పడడంతో ఆ డేట్ క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు సైజ్ జీరో టీమ్. అనుష్క నటించిన సైజ్ జీరో అక్టోబర్ 9న రిలీజ్ కాబోతుండడం విశేషం. అయితే రుద్రమదేవి మిస్ అయిన అనుష్క మాత్రం అభిమానులను అలరించడానికి ఫిక్స్ అయిపొయింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.