English | Telugu

అల్లు అర్జున్ రూ.20 లక్షల ఆర్థిక సాయం

హుదూద్ తుఫాన్ బాధితులకు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రస్తుతం కొచ్చిన్ లో ఉన్న అల్లు అర్జున్ హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమైందన్న వార్త తనను కలిచి వేసిందని అర్జున్ పేర్కొన్నారు. టీవీల్లో తుఫాన్ వార్తలు తెలుసుకున్న ఆయన వారు పడుతున్న బాధలతో తీవ్ర ఆవేదనకు గురైనట్టు చెప్పాడు. తనవంతు సాయంగా సిఎం రిలీఫ్ ఫండ్ కు తక్షణమే రూ.20 లక్షలు ఇస్తున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఆదివారం సంభవించిన హుదుద్ తుఫాన్ భీభత్సంతో... నాకెంతో ఇష్టమైన విశాఖపట్నం రూపురేఖలను మార్చేయడం దురదృష్టకరం. ముఖ్యంగా రైతులు, మధ్యతరగతివారు, మత్స్యకారులు తీవ్రంగా నష్ట పోయారు. నేను ప్రకటించిన 20 లక్షల ఆర్థిక సాయంలో ఎక్కువ భాగం సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారుల కోసం ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారి వలలు, పడవలు ధ్వంసమవ్వడంతో జీవనోపాధి దెబ్బతినడం నన్ను కలచివేసింది. మెగాభిమానులు సైతం తుఫాను సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తోచినంత సాయం చేయాల కోరుతున్నానని అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.