English | Telugu

అల్లు అర్జున్ కేరళపై దాడికి రెడీ..!

మన హీరోలు తెలుగు కాకుండా మరో భాషలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న దాఖలాలు చాలా తక్కువ. అల్లు అర్జున్ మాత్రం ఆ హీరోల్లో మినహాయింపు. తెలుగులో ఎంత మార్కెట్ ఉందో, అంతే రేంజ్ ను మళయాళంలో కూడా క్రియేట్ చేసుకున్నాడు బన్నీ. అక్కడి స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ తో సమానంగా బన్నీకి స్టార్ స్టేటస్ ఉందంటే అర్ధం చేసుకోవచ్చు అక్కడ అతని రేంజ్. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా వందకోట్ల గ్రాస్ సాధించేసిన సరైనోడును కూడా ఈ నెల 27న కేరళ రాష్ట్ర వ్యాప్తంగా డబ్ చేసి ' యోధావు ' గా రిలీజ్ చేస్తున్నారు. అక్కడి అల్లు అర్జున్ అభిమానులు కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ విషయాన్ని తన ఫేస్ బుక్ లో అఫీషియల్ గా బన్నీ ప్రకటించాడు. ఇప్పటికే 60 కోట్ల షేర్ ను దాటేసిన సరైనోడు, యోధావుగా ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి మరి.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.