English | Telugu

లేడీ ఎమ్మెల్యే కోసం పాట పాడుతున్న అల్లు అర్జున్..!

అల్లు అర్జున్ సరైనోడికి ఆడియో ఫంక్షన్ లేదు. డైరెక్ట్ గా పాటల్ని మార్కెట్ లోకి రిలీజ్ చేసేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో సరైనోడు సాంగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ సాంగ్స్ తో ఆడియన్స్ లో క్రేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బన్నీ అండ్ కో. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ అల్లు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. అంజలి ఐటెం గర్ల్ గా ఆ సాంగ్ లో బన్నీతో చిందేసింది.

మరో పాట యు ఆర్ మై ఎమ్మెల్యే వింటే ఒక విషయం తెలుస్తుంది. అల్లు అర్జున్, క్యాథరీన్ ట్రెసా ఫోటోలు పెట్టారు కాబట్టి ఈ సాంగ్ వాళ్లిద్దరి మధ్యా అని అర్ధమవుతోంది. ఇప్పటికే సరైనోడులో క్యాథరీన్ ఎమ్మెల్యే పాత్ర చేస్తోందని, ఆమెకు బాడీగార్డ్ గా బన్నీ చేస్తున్నాడంటూ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టాక్ కు బలం చేకూరుస్తూ ఈ సాంగ్ ఎమ్మేల్యే పై సాగడం విశేషం. ఇద్దరు హీరోయిన్లతో బన్నీ సరైనోడులో ఏ రేంజ్ లో చిందేశాడో తెలియాలంటే స్టైలిష్ స్టార్ అభిమానులు ఏప్రిల్ 22 వరకూ ఆగాల్సిందే. ఇంతకూ ఎమ్మెల్యేకు సాంగ్ లో డెఫినిషన్ ఇచ్చారో తెలుసా..? మై లవ్లీ ఏంజల్..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.