English | Telugu

లీకైన సరైనోడు సాంగ్.... పోలీసుల దర్యాప్తు!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బొలీవియాలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ లొకేషన్స్ లో ఎవ్వరూ చిత్రీకరించలేదు. ఇదిలా ఉంటే.. సరైనోడు చిత్రానికి సంబంధించి లీక్ అయిన ఆడియో సాంగ్ ను ఎక్కడ, ఎవరు, ఏ విధంగా ఉపయోగించినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని నిర్మాతలు హెచ్చరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు నిర్మాతలు తెలియజేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి... ఎన్నో వ్యయప్రయాసలకోర్చి... ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన సరైనోడు చిత్రానికి సంబంధించిన లీక్ అయిన కంటెంట్ ను ఉపయోగించి సమస్యల్లో చిక్కుకోవద్దని నిర్మాతలు తెలియజేశారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.