English | Telugu

‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఆత్మీయ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి!

ఈమధ్యకాలంలో ఎంతోమంది సినీ ప్రముఖులు కన్ను మూశారు. ఇప్పుడు కోలీవుడ్‌ ఇండస్ట్రీకి మరో విషాదం నెలకొంది. అజిత్‌ హీరోగా నటిస్తున్న ‘విడాముయర్చి’ షూటింగ్‌లో అజిత్‌కి ఎంతో ఆత్మీయుడైన ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ గుండెపోటుతో మరణించారు. ఈ సినిమాకి ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిలన్‌.. ఈ సినిమా షూటింగ్‌ కోసం అజర్‌బైజాన్‌లో ఉన్నారు. అక్కడ గుండెపోటుకు గురయ్యారు. తెల్లవారుజామున గుండెల్లో నొప్పిగా ఉందని యూనిట్‌ సభ్యులతో చెప్పడంతో వెంటనే ఆయన్ని సమీపంలోని హాస్పిటల్‌కి తరలిస్తుండగా దారిలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

2006లో విడుదలైన ‘గలాబా కాదలన్‌’ చిత్రం ద్వారా ఆర్ట్‌ డైరెక్టర్‌గా పరిచయమైన మిలన్‌.. ఆ తర్వాత అజిత్‌ హీరోగా నటించిన వేలాయుధం, వీరమ్‌, రజనీకాంత్‌ అన్నాత్తై చిత్రాలకు పనిచేశారు. అజిత్‌కు ఎంతో ఇష్టమైన ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌. అజిత్‌ హీరోగా నటించిన రెండు సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన మిలన్‌కి, అజిత్‌కి మంచి అనుబంధం ఉంది. తన ఆత్మీయుడ్ని కోల్పోవడం పట్ల అజిత్‌ ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌ చేస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’పై భారీ అంచనాలు ఉన్నాయి. విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటోందన్న వార్త తెలిసిన అభిమానులు ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఇలాంటి విషాదకరమైన వార్త వినాల్సి రావడంతో ఎంతో వ్యధకు లోనవుతున్నారు. షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ప్రాణాలు విడవడం ఎంతో బాధాకరమైన విషయమని నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.