English | Telugu

ప్రభాస్‌ బర్త్‌డే వచ్చేస్తోంది.. ఈసారి సెలబ్రేషన్స్‌ ఎక్కడో తెలుసా?

సాధారణంగా హీరోల పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్‌గా చేసుకుంటారు అభిమానులు. ఆ తరం హీరోల అభిమానుల నుంచి ఇప్పటి యంగ్‌ హీరోల అభిమానుల వరకు తమ హీరో పుట్టినరోజును ఒక పండగగానే భావిస్తారు. దానికి తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేయడం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి పాతతరం హీరోలకు జరిగినట్టుగా ఈ తరం హీరోలకు పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభిమానుల్లో తక్కువైందనే చెప్పాలి. అయినప్పటికీ కొంతమంది వీరాభిమానులు తమ హీరో పుట్టినరోజును గ్రాండ్‌గా చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అక్టోబర్‌ 23న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు. తమ హీరో పుట్టినరోజును వైభవంగా జరుపుకునేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ పుట్టినరోజుకు ప్రభాస్‌ ఇండియాలో ఉండడం లేదు. మోకాలికి సర్జరీ చేయించుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం యూరప్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఏడాది తన బర్త్‌డేను అక్కడే జరుపుకోవాలని డిసైడ్‌ అయ్యాడట. తన స్నేహితులను, సన్నిహితులను, కుటుంబ సభ్యులను యూరప్‌కే పిలుపించుకొని వారి సమక్షంలోనే తన బర్త్‌ డే జరుపుకోవాలనుకుంటున్నాడు ప్రభాస్‌. అరోజు తన బర్త్‌ డే స్పెషల్‌గా తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా రాబోతున్నాయి.

ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్‌గా కొత్త సినిమాల అప్‌డేట్స్‌ను రెడీ చేస్తున్నారు. ‘సలార్‌’ నుంచి ఓ స్పెసల్‌ గ్లింప్‌ రాబోతోంది. అలాగే ‘కల్కి’ నుంచి కూడా అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా ప్రభాస్‌ పుట్టినరోజునే రిలీజ్‌ చేస్తారట.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.