English | Telugu

అజిత్‌తో నేను గొడవ పడలేదు-విశాల్

తెలుగు, తమిళ భాషాల్లో హీరోగా, ప్రోడ్యూసర్‌గా దూసుకుపోతున్న విశాల్ వివాదాలకు దూరంగా ఉంటాడు. సీనియర్లను గౌరవించడంతో పాటు తోటి హీరోలతో కలివిడిగా ఉంటూ ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. అలాంటి విశాల్ తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్‌తో గొడవ పడ్డాడంటూ మీడియాలో పుకార్లు బయలు దేరాయి. విశాల్ సెక్రటరిగా ఉన్న నడిగర్ సంఘం రీసెంట్‌గా నచ్చత్ర క్రికెట్ అనే టోర్నమెంట్‌ను అన్నీతానై చూసుకున్నాడు. నడిగర్ సంఘంకు ఓ బిల్డింగ్‌ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఫండ్ రైజింగ్ కార్యక్రమంగా జరిగిన ఈ టోర్నమెంట్‌ నిర్వహించారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత సాయంత్రం అందరూ హీరోలు పార్టీ చేసుకున్నారు.

అయితే అనుకున్నంత స్థాయిలో స్టార్ క్రికెట్ సక్సెస్ కాకపోవడంతో విశాల్ బాగా అప్సెట్ అయ్యాడంట. ఆ కోపంలో అజిత్ సినిమాలోని ఓ పాట ప్లే అవుతుంటే విశాల్ దానిని ఆపేయమని అన్నారట. అజిత్‌కు, విశాల్‌కు ఏదో గొడవ జరిగిందని, అందువల్లే ఆయన పాటను విశాల్ ప్లే కాకుండా అడ్డుకున్నారని నడిగర్ సంఘంలో వదంతులు వ్యాపించాయి. ఈ మాట ఆనోట ఈనోట విశాల్ చెవిన పడటంతో ఆయన అంతెత్తున లేచారు. అలాంటిదేమీ లేదని, ఇలాంటి అర్థం పర్థం లేని రాతలు మానుకోవాలని చెబుతూ పుకార్లను ఖండించారు. తాను స్వయంగా చెప్పనివి ఇలా రాయడం సబబు కాదని మీడియాకు వార్నింగ్ ఇచ్చారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.