English | Telugu

రాజ‌మౌళిపై క‌త్తిక‌ట్టాడు

రాజ‌మౌళి - ప్ర‌భాస్‌ల బాహుబ‌లి కోసం చిత్ర‌సీమ యావ‌త్తు ఎదురుచూస్తోంది. టాలీవుడ్ ఒక్క‌టే కాదు భార‌త‌దేశం మొత్తం బాహుబ‌లి ఎలా ఉండ‌బోతోంద‌న్న విష‌యంపై ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటోంది. ఈ సినిమాలో ప‌నిచేసినా, ప‌నిచేయ‌క‌న‌పోయినా `బాహుబ‌లి లాంటి సినిమా తెలుగులో తెర‌కెక్క‌డం మ‌నంద‌రి అదృష్టం` అని అంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. అయితే ఒక్క న‌టుడు మాత్రం ఈ సినిమాపై క‌త్తిక‌ట్టాడు.

`బాహుబ‌లిని, రాజ‌మౌళిని నేను స‌పోర్ట్ చేయ‌లేను` అంటూ త‌న అస‌హ‌నాన్ని అయిష్టాన్నీ బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నాడు. ఆ న‌టుడెవ‌రో కాదు. సీనియ‌ర్ ఆర్టిస్ట్ సురేష్‌. తెలుగులో ఇంత‌మంది ప్ర‌తిభావంతులు ఉండ‌గా నాజ‌ర్‌లాంటి వాళ్ల‌కు బాహుబ‌లిలో అవ‌కాశం ఇవ్వ‌డం ఏమిటి? సాయికుమార్‌, సుమ‌న్‌లాంటి న‌టుల్ని వ‌దిలేసి ప‌ర‌భాషా న‌టులు అవ‌కాశాలు ఇస్తారా? అంటూ సురేష్ నిల‌దీస్తున్నాడు.

తెలుగులో ప‌రభాషా న‌టుల ఆధిపత్యంపై సురేష్ ముందు నుంచీ విమ‌ర్శ‌నగ‌ళం వినిపిస్తూనే ఉన్నాడు. ఈసారి బాహుబ‌లిలాంటి పెద్ద‌సినిమాని టార్గెట్ చేయ‌డం కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సురేష్ ని గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ ఏమాత్రం ప‌ట్టించుకోవడం లేదు. ఆ ఆక్రోశం ఇలా చూపించేస్తున్నాడేమో.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.