English | Telugu

మంచు విష్ణుతో తనికెళ్ల భరణి ‘కన్నప్ప కథ’

ఎనిమిది దశాబ్దాలను పూర్తి చేసుకున్న టాలీవుడ్ లో ఎన్నో మరపురాని చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. అటువంటి మేటి చిత్రాల్లో కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నిర్మిస్తూ, నటించిన చిత్రం పెదరాయుడు ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఆప్త మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించడం విశేషం. కుటుంబంలో బంధాలు, అనుంబంధాలు గురించి గొప్పగా చాటి చెప్పిన ఈ చిత్రంలో పెదరాయుడుగా మోహన్ బాబు నటన అద్వితీయం. ఈ చిత్రం ఇరవై వసంతాలను పూర్తి చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా దశ, దిశను మార్చిన చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాలోని ప్రతి డైలాగ్ ఇప్పటికీ, ఎప్పటీకీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిపోతాయి.

పెదరాయుడుగా తెలుగు ప్రజలను అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారతదేశంలోని అన్నీ భాషల్లో ‘కన్నప్ప కథ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమశివుని మహాభక్తుడిగా పేరు పొందిన కన్నప్ప గురించి తెలియని తెలుగువాడుండడు. ఆయన భక్తికి తార్కాణమే శ్రీ కాళహస్తీశ్వరాలయం. శివుని పరమవీర భక్తునిగా పేరు పొందిన కన్నప్ప పాత్రలో యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు నటించనున్నారు. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ, హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని డా.మోహన్ బాబు తెలియజేశారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.