English | Telugu

విశాల్ ఆరోగ్యంపై వరలక్ష్మి శరత్ కుమార్ ఏమని చెప్పింది 

తమిళనాట ఉన్న అగ్ర హీరోల్లో విశాల్(Vishal)కూడా ఒకడు.2004 లో సినీ రంగ ప్రవేశం చేసిన విశాల్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని సంపాదించుకున్నాడు.ఆ సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యి కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని పొందాడు.అలాంటి విశాల్ రీసెంట్ గా జరిగిన తన అప్ కమింగ్ మూవీ 'మదగజరాజ' మూవీ ఫంక్షన్ కి హాజరయ్యాడు.అందులో విశాల్ బాగా సన్నబడి ఉండటంతో పాటుగా బాగా వణుకుతూ కనిపించాడు.దీంతో అయన హెల్త్ పై రకరకాల వార్తలు వచ్చాయి.కొంత మంది సినిమా వాళ్ళు మాత్రం విశాల్ కి వైరల్ ఫీవర్ రావడం వలన అలా ఉన్నాడని స్పందించడం జరిగింది.

ఇప్పడు లేటెస్ట్ గా విశాల్ ఆరోగ్యంపై ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi sarathkumar)స్పందిస్తు విశాల్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు చూసాను.ఆయన త్వరగా కోలుకోవాలని,మంచి ఆరోగ్యంతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.గతంలో విశాల్,వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం నడిచినట్టుగా పలు కధనాలు వచ్చిన నేపథ్యంలో విశాల్ ఆరోగ్యంపై వరలక్ష్మి మాట్లాడిన మాటలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.ఇక 'మదగజరాజ' లో వరలక్ష్మి కూడా నటించింది.ఈ సందర్భంగా సినిమా గురించి కూడా ప్రస్తావిస్తు విశాల్ ఈ సినిమాలో చాలా కష్టపడి నటించాడు.8 ప్యాక్ బాడీతో కనిపిస్తాడు.పైగా ఈ మూవీ నా సినీ కెరీర్ లో రెండవ చిత్రం అని కూడా చెప్పుకొచ్చింది.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.