English | Telugu

త్రివిక్రమ్ పట్టుకుంటే కోట్లే..!

టాలీవుడ్‌ మార్కెట్‌ పరిధి ఎంతో అందరికీ తెలిసిందే. రూ.50 కోట్ల మార్కు అందుకుంటే అద్భుతమే అని చెప్పాలి. ఈ ఘనత కూడా అందరు స్టార్‌ హీరోలకూ సాధ్యం కాలేదు. చాలా తక్కువ మంది మాత్రమే కలెక్షన్లలో ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్నారు. ఐతే వరుసగా ఒకటికి రెండు సినిమాలు రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడమంటే చిన్న విషయం కాదు. టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఇంతకుముందు ఆయన నుండి వచ్చిన అత్తారింటికి దారేది అంచనాల్ని మించిపోయి ఆడి రూ.80 కోట్ల దాకా వసూలు చేసింది. ఇప్పుడు మళ్ళీ సన్నాఫ్‌ సత్యమూర్తి రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరింది. అత్తారింటికి దారేది సూపర్ టాక్ వచ్చింది కాబట్టి ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టడం విశేషమేమీ కాదు. కానీ సన్నాఫ్‌ సత్యమూర్తి డివైడ్‌ టాక్‌ను తట్టుకుని 50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం గొప్ప విషయమే. దీంతో వరుసగా రెండు రూ.50 కోట్ల సినిమాలిచ్చిన దర్శకుడుగా త్రివిక్రమ్ రికార్డ్ సృష్టించాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.