English | Telugu

త్రివిక్ర‌మ్‌కీ ఇలియానాకీ మ‌ధ్య ఏం జ‌రిగింది?

క‌థానాయ‌కుడికీ క‌థానాయిక‌కీ కెమిస్ట్రీ ఎంత అవ‌స‌ర‌మో, నాయిక‌కీ, ఆ ద‌ర్శ‌కుడికీ ట్యూనింగ్ అంతే అవ‌స‌రం. ఓ క‌థానాయిని స్టార్ గా మార్చాల‌న్నా, ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయేలా తెర‌పై ఆవిష్క‌రించాల‌న్నా అది ద‌ర్శ‌కుల‌కే సాధ్యం. అయితే ఎందుకనో ఇలియానా, త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య చెప్ప‌లేనంత గ్యాప్ వ‌చ్చింది. జ‌ల్సా కోసం తొలిసారి ఇలియానాని క‌థానాయిక‌గా ఎంచుకొన్నాడు త్రివిక్ర‌మ్‌. ఆసినిమా హిట్ట‌య్యింది. ఇలియానాకూడా బాగానే చేసింది. అందుకే ఆ త‌ర‌వాత జులయిలోనూ ఇలియానాకే క‌థానాయిక పోస్టుఇచ్చాడు. ఆ సినిమా హిట్ట‌యినా.... ఇలియానాకీ, త్రివిక్ర‌మ్‌కీ మ‌ధ్య చెడింది. షూటింగ్ స‌మ‌యంలో ఇలియానా...త్రివిక్ర‌మ్‌కి చుక్క‌లు చూపించింద‌ట‌.

సెట్లో ఇలియానా ప్ర‌వర్త‌న త్రివిక్ర‌మ్‌నే కాదు, చిత్ర‌బృందం మొత్తానికి షాక్ ఇచ్చేలా సాగింద‌ట‌. చెప్పిన స‌మ‌యానికి సెట్‌కి రాక‌పోవ‌డం, చెప్పాపెట్ట‌కుండా షూటింగ్‌కి డుమ్మా కొట్ట‌డంతో ఇలియానాపై త్రివిక్ర‌మ్ చాలాసార్లు సీరియ‌స్ అయ్యాడ‌ట‌. ఇక‌మీద‌ట ఇలియానాతో ప‌నిచేయ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడ‌ని టాక్‌. అందుకే ఆ త‌ర‌వాత ఇలియానా పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా త్రివిక్ర‌మ్ ఆస‌క్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది.

అయితే.. ఈమ‌ధ్య మాత్రం ఇలియానా త్రివిక్ర‌మ్‌తో ట‌చింగ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. నితిన్‌తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. కథానాయిక‌గా స‌మంత‌ని ఎంచుకొన్నారు. ఒక‌వేళ స‌మంత ఈ సినిమా చేయ‌లేని ప‌క్షంలో మ‌రో క‌థానాయిక‌ని ఎంచుకోవ‌డం త‌ప్ప‌దు. అందుకే ఇలియానా ఇప్పుడు త్రివిక్ర‌మ్‌ని కాకాప‌డుతోంద‌ట‌. `అవ‌స‌రం అనుకొంటే నా పేరు ప‌రిశీలించండి. మీతో మ‌రో సినిమా చేయాల‌నివుంది` అంటూ త్రివిక్ర‌మ్‌ని అడుగుతోంద‌ట‌. ఈసారి ఎలాంటి త‌ప్పు చేయ‌కుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలుగుతాన‌ని మాటిస్తోంద‌ట‌.
మ‌రోవైపు నితిన్ కూడా ఇలియానా పేరు సూచిస్తున్నాడ‌ట‌. స‌మంత కాల్షీట్లు దొర‌క‌ని ప‌క్షంలో ఇలియానాని తీసుకొంటే బాగుంటుంద‌ని చెప్తున్నాడ‌ట‌. ఇలియానా - నితిన్‌ల మ‌ధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇద్ద‌రూ క‌ల‌సి గ‌తంలో ఓ సినిమా చేశారు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ ప్రెండ్స‌యిపోయారు. ఆ చ‌నువుతోనే ఇలియానా పేరు సూచిస్తున్నాడ‌ట‌. మ‌రి హీరో మాట‌కు త్రివిక్ర‌మ్ ఎంత వ‌ర‌కూ విలువనిస్తాడో చూడాలి. ఇలియానా గ‌నుక త్రివిక్ర‌మ్ సినిమాలో మ‌రో సారి ఛాన్స్ అందుకొంటే.. అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.