English | Telugu

హైదరాబాద్ లో నాగ్ ఢమరుకం

హైదరాబాద్ లో నాగ్ "ఢమరుకం" షూటింగ్ జరుగుతూంది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా, అందాల యోగా టీచర్ అనుష్క, సీనియర్ హీరోయిన్లు స్నేహ, సిమ్రాన్ హీరోయిన్లుగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్‍ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం" ఢమరుకం". నాగ్ "ఢమరుకం" సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలోని, బి.హెచ్.ఇ.ఎల్. సమీపాన కల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో జరుగుతూంది. హీరోయిన్ అనుష్క, నటుడు బ్రహ్మాజీలతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొనగా నాగ్ "ఢమరుకం"సినిమా షూటింగ్ జరిగింది.

ఇప్పటికే నాగ్ "ఢమరుకం"సినిమాలోని ఒక యుగళ గీతాన్ని హీరో హీరోయిన్లు నాగార్జున, అనుష్కలపై స్విట్జర్ల్యాండ్ లో చిత్రీకరించారు. బడ్జెట్ 50 కోట్లని వినికిడి. నాగార్జున సినీ కేరీర్ లోనే ఇది అత్యధిక భారీ బడ్జెట్ సినిమా అంటున్నారు. నాగ్ "ఢమరుకం" సినిమాలో 55 నిమిషాల పాటు గ్రాఫిక్స్ వర్క్ ఉందట. యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ ఈ నాగ్ "ఢమరుకం" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. నాగ్ "ఢమరుకం" సినిమాకి చోటా.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.