English | Telugu

రచ్చలో ముఠా మేస్త్రిగా రామ్ చరణ్...?

"రచ్చ" లో ముఠామేస్త్రిగా రామ్ చరణ్...నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైందీ ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "రచ్చ".ఈ "రచ్చ" సినిమాలో హీరో రామ్ చరణ్ గతంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ముఠామేస్త్రి" సినిమాలోని దేశభక్తి పరుడైన ముఠామేస్త్రి వంటి పాత్రలో నటించనున్నాడని తెలిసింది. అది అవుట్ అండ్ అవుట్‍ పక్కా మాస్ పాత్ర.

తన కెరీర్ గ్రాఫ్ మళ్ళీ పైకి లేవాలంటే పూర్తిస్థాయి మాస్ పాత్రలోనే నటించాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అదే విషయాన్ని దర్శకుడు సంపత్ నందితో కూడా చెప్పాడట. "రచ్చ" సినిమాలో "ముఠామేస్త్రి" సినిమాలోని చిరంజీవి టైపు పాత్రతో పాటు,"గ్యాంగ్ లీడర్" సినిమాలోని "వానవాన వెల్లూవాయే" అనే పాటను కూడా రామ్ చరణ్ ఈ "రచ్చ" సినిమాసినిమా కోసం వాడుకోవటం విశేషం. రచ్చ" సినిమాలో కలర్స్ స్వాతి కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనుంది. ఈ "రచ్చ" సినిమా ఈ వారంలోనే ప్రారంభం కానుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.