English | Telugu

పెళ్లి చేసుకుని దొంగతనం చేసిన హీరోయిన్

రాజ రాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై హరిని దర్శకుని గా పరిచయం చేస్తూ జ్యోతి రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ హీరోగా నిర్మాత రాజ రాజేశ్వరి శ్రీనివాస రెడ్డి నిర్మించిన చిత్రం "లక్కీ". ఈ చిత్రంలో శ్రీకాంత్ కి జోడీగా అందాల హాట్ బ్యూటీ మేఘనారాజ్ నటించింది. కాగా మేఘన ఇప్పుడు చిత్రమైన వివాదంలో ఇరుక్కుని మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ హాట్ టాపిక్ ఏమిటంటే... తమిళనాడుకు చెందిన జనార్దన్ అనే వ్యాపారవేత్త తనను మేఘన పెళ్లాడి మోసగించిందంటూ పోలీసుకులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు.


ఈ ఫిర్యాదు గురించి బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ లోకేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... సరైన సాక్ష్యాలు చూపకపోవడంతో మేఘన రాజ్ ఇచ్చిన కేసును మూసేసినట్లు వెల్లడించారు. జనార్దన్ మాత్రం మేఘనారాజ్ తనను పెళ్లాడి మోసగించడంతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా దొంగలించి సాక్ష్యాలు లేకుండా చేసిందంటూ మరో కంప్లైంట్ చేసాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .