English | Telugu

ఎన్టీఆర్‌కు షాకిచ్చిన బాలీవుడ్ భామ‌

ఎన్టీఆర్ సినిమా అంటే ఏక‌థానాయిక అయినా ఎగిరి గంతేస్తుంది. కాల్షీట్లు ఎన్ని కావాలీ... అంటూ తొంద‌ర‌పెడుతుంది. అయితే ఇదంతా ఇక్క‌డ‌. బాలీవుడ్ లో అంత సీన్ లేద‌ని ప‌రిణీతీ చోప్రా నిరూపించింది. ఎన్టీఆర్ సినిమాలో న‌టిస్తారా అని అడిగితే ''అబ్బే సౌత్ ఇండియ‌న్ సినిమాల‌పై నాకంత ఇంట్ర‌స్ట్ లేదు.. చేయాల‌నీ లేదు. నిజానికి అంత టైమ్ లేద‌''ని గొప్ప‌లు పోతోంది.

ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి జ‌న‌తా గ్యారేజ్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌గా బాలీవుడ్ భామ ప‌రిణీతీ చోప్రాని ఎంచుకొన్నార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ప‌రిణీతీ మాత్రం ఈ ఆఫ‌ర్ ఒప్పుకోలేద‌ట‌. `బాలీవుడ్‌లో ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉన్నా.. ఇప్పట్లో సౌత్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టించ‌లేను` అని తేల్చి చెప్పేసిన‌ట్టు టాక్‌. దాంతో.. చిత్ర‌బృంతం గ‌తుక్కుమంద‌ట‌. ఎన్టీఆర్ సినిమా అంటే ఎగురుకొంటూ వ‌స్తుంద‌నుకొంటే.. అంత షాక్ ఇచ్చిందేంటి??? అంటూ షాకైపోతున్నారు.

ఇక్క‌డే ఖాళీగా ఉన్న ఏ స‌మంత‌నో, కాజ‌ల్‌లో వెదుక్కొంటే స‌రిపోతుంది లే అని డిసైడ్ అయ్యార‌ట‌. ఒక‌ట్రెండు రోజుల్లో క‌థానాయిక ఎంపిక‌పై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.