English | Telugu

గిల్లిక‌జ్జాలు పెట్టుకొంటున్న మ‌హేష్ హీరోయిన్లు



క‌థ‌.. అందులో నా పాత్ర న‌చ్చితే చాలు.. మా స్థానం ఏంట‌న్న‌ది అడ‌గం... అంటుంటారు క‌థానాయిక‌లు. అయితే ఇలాంటి మాట‌లు చెప్పుకోవ‌డానికి బాగుంటాయి. వాస్త‌వంలో మాత్రం ఆ స్థానం కోస‌మే గిల్లికజ్జాలు మొద‌ల‌వుతాయి. ఇప్పుడు స‌మంత‌, కాజ‌ల్ మ‌ధ్య అదే జ‌రుగుతోంది. వీరిద్ద‌రూ బ్ర‌హ్మోత్స‌వంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న న‌టిస్తున్నారు. ఇందులో మూడో నాయిక ప్ర‌ణీత కూడా ఉంది. ప్ర‌ణీత అన‌గానే ఎలాగూ `సెకండ్ హీరోయిన్‌` అనే ముద్ర ప‌డిపోయింది. ఈ సినిమాతో `మూడోనాయిక‌` కి ప‌డిపోయింది.

ఇప్పుడు స‌మ‌స్యల్లా తొలి స్థానం ఎవ‌రిద‌నే. ఫామ్‌ని బ‌ట్టి చూస్తే స‌మంత‌కు, సీనియార్టిని బ‌ట్టి చూస్తే కాజ‌ల్‌కి ఫ‌స్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఈ విష‌యంలోనే ఈ క‌థానాయిక‌లిద్ద‌రూ ద‌ర్శ‌కుడికి నిద్ర లేకుండా చేస్తున్నార్ట‌. `ఈ సినిమాలో నేనే క‌దా ఫ‌స్ట్ హీరోయిన్ ` అంటూ అటు కాజ‌ల్‌, ఇటు స‌మంత ఫోన్లు చేసి మ‌రీ విసిగిస్తున్నార‌ట‌. `మీ ఇద్ద‌రి పాత్ర‌లూ స‌మానంగానే ఉంటాయి` అని చెబుతున్నా... `ప్ర‌మోష‌న్ల‌లో నాకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి` అంటూ కండీష‌న్లు పెడుతున్నార్ట‌.

సినిమాలో ముగ్గురు క‌థానాయిక‌లుంటే ఎవ్వ‌రికీ ప్రాధాన్యం ఉండ‌ద‌న్న భ‌యం హీరోయిన్ల‌ది. అందుకే కాజ‌ల్‌, స‌మంత తెగ హైరానా ప‌డిపోతున్నారు. మ‌రి వీరిద్ద‌రి భ‌యాన్ని ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల ఎలా పోగొడ‌తాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.