English | Telugu

మహేష్ మణిరత్నం మూవీలో రీచా గంగోపాథ్యాయ

మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో రాబోయే తెలుగు, తమిళ, హిందీ మూవీలో రీచా గంగోపాథ్యాయ హీరోయిన్ గా ఎన్నికయ్యిందని ఫిలిం నగర్ వర్గాల కథనం. "పొన్నియన్ సెల్వన్" అనే తమిళ చారిత్రక నవలకు వెండి తెర రూపం ఇస్తూ మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా నిర్మిస్తున్న చిత్రంలో "లీడర్" ఫేం రీచా గంగోపాథ్యాయ హీరోయిన్ గా మహేష్ బాబు సరసన బుక్కయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.


ఈ విషయం గురించి రిచా గంగోపాథ్యాయను అడగ్గా తాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించాననీ ఇది తనకు సువర్ణావకాశమని, ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో మీడియాకు తెలియజేస్తాననీ రీచా గంగోపాథ్యాయ మీడియాతో అంది. గతంలో ఈ పాత్ర కోసం అనుష్కను అనుకున్నారట. కానీ ఆమెకు డేట్లు కుదరక ఈ చిత్రం వదులుకోవలసి వచ్చింది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో విజయ్, ఆర్య నటిస్తూండగా, తెలుగులో మహేష్ బాబు, రిచా గంగోపాథ్యాయ నటిస్తున్నారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.