English | Telugu
బాలీవుడ్ భామను నిలదీసిన అధికారులు
Updated : Jun 19, 2014
బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు 2 గంటలపాటు నిలిపివేశారు. ఆమె వద్ద వున్న ఒక పౌడర్ విషయంలో అనుమానం తలెత్తి విమానాశ్రయ భద్రతాధికారులు, కస్టమ్స్ అధికారులు రెండు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఆయుర్వేద పౌడర్ డబ్బాని చూసి అధికారులు అనుమానించారని. చర్మ సౌందర్యానికై తాను ఆరు నెలలుగా వాడుతున్నానని ఆమె అధికారులకు నచ్చచెప్పినా వారు వినిపించుకోలేదట.
ఢిల్లీ నుంచి ఇంతకు ముందు ఇలా తీసుకువెళ్లినప్పుడు ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది ఎదురవలేదని మొదటి సారి ఇలా అధికారులు తనను నిలిపివేశారని రిచా చడ్డా చెప్పుకొచ్చింది. ఆయుర్వేదాన్ని తాను పూర్తిగా నమ్ముతానని, అందుకే ఆయుర్వేద వస్తువులే వాడతానని రిచా తెలియచేసింది. అయితే ఆ ఆయుర్వేద పౌడర్ దొరకడం కష్టమని అందుకే ఆ డబ్బా తెరవడానికి తాను ఒప్పుకోలేదని రిచా తెలిపింది. కానీ వారు ఈ విషయాన్ని నమ్మకపోవడంతో డబ్బా తెలిచి చూపించాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు. ఆమె 'గోలియోంకా రాస్ లీల రామ్ లీల' సినిమాలో దీపికా పదుకునేకు 'గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్', 'ఓయే లక్కి! లక్కి ఓయే' చిత్రాల్లో నటించింది.