English | Telugu

రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా..ముందు కారు దిగడం నేర్చుకోవాలి 

రష్మిక (rashmika) సినీ ప్రయాణం ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. వరుసగా హిట్ లు మీద హిట్ లు కొడుతు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. చాలా తక్కువ టైం లోనే ఆ ఘనతని సాధించడంతో పాటు సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ తో భారీ స్థాయిలో అభిమానుల్ని పొందింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు అది రాజకీయ వాసనని తెస్తుంది

అటల్ సేతు(atal setu)..దేశంలోనే అతి పెద్ద మూడవ బ్రిడ్జ్. జపాన్ దేశ సహకారంతో ముంబై లోని సముద్రం మీద దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ కి రష్మిక కి సంబంధం ఏంటనుకుంటున్నారా. అటల్ సేతు ని పొగుడుతు రష్మిక ట్వీట్ చేసింది.రెండు గంటల ప్రయాణాన్ని ఇరవై నిమిషాల్లో పూర్తి చేయడం అధ్బుతం. దేశంలో మౌలిక సదుపాయాలు, రహదారి ప్రణాళికలు బాగున్నాయంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం పైనే రష్మిక మీద కొంత మంది విమర్శలు చేస్తున్నారు. పైగా ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేసారు. మరో కంగనా రనౌత్ లాగా మారాలనుకుంటున్నావా, ఒక వంతెనని చూపించి భారతదేశం ముందుకు వెళ్తుందని చెప్పడం అవివేకం. సాధారణ భారతీయుడు తన రోజు వారి జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో తెలుసుకోవాలంటే లోకల్ ట్రైన్ లో ప్రయాణం చెయ్యి. తను చెప్తున్న మౌలిక సదుపాయల గురించి తెలుసుకోవాలంటే రష్మిక కారు దిగాలి. రష్మిక ఇన్ డైరెక్ట్ గా బిజెపి కి సపోర్ట్ చేస్తుంది. రాజకీయాల్లోకి వస్తుందేమో.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది నుంచి సపోర్ట్ గా కూడా కామెంట్స్ వస్తున్నాయి.

అటల్ సేతు ఇరవై రెండు కిలో మీటర్ల పొడవుతో 18000 కోట్లతో నిర్మాణం అయ్యింది. సౌత్ ముంబై నుంచి నావి ముంబై కి వెళ్లాలంటే మినిమమ్ రెండు గంటల సమయం పడుతుంది.అలాంటిది ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కేవలం 20 నిమిషాల్లో ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళవచ్చు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) జనవరిలో ప్రారంబించాడు. ఇక రష్మిక ఇటీవల యానిమల్ తో భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 , గర్ల్ ఫ్రెండ్,కుబేర లు షూటింగ్ దశలో ఉన్నాయి

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.