English | Telugu
తిరుపతిలో 'బాహుబలి' ఆడియో
Updated : Jun 9, 2015
టాలీవుడ్ దర్శకసంచలనం యస్.యస్.రాజమౌళి రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి`ది బిగినింగ్’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం ఈ నెల 13న తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకను నిర్వహించే సువర్ణావకాశాన్ని ‘యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.’ సొంతం చేసుకొంది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. జులై 10న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆర్కా మీడియా పతాకంపై కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ..ప్రసాద్ దేవినేని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.