English | Telugu
వార్-2 లో ఎన్టీఆర్ కనిపించేది 45 నిమిషాలే.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ!
Updated : Jul 15, 2025
జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు. జూలై 31న విడుదల కానున్న 'కింగ్ డమ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వార్-2' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నాగవంశీ.
"ఇండియాలోని ఇద్దరు ఫైనెస్ట్ యాక్టర్స్ స్క్రీన్ మీద నువ్వా నేనా అన్నట్టుగా తలపడనున్నారు. అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలతోనే నేను వార్-2 రైట్స్ తీసుకున్నాను. ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ ఉంటుందని, 45 నిమిషాలే కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఇద్దరు హీరోల పాత్రలు సమానంగా ఉంటాయి. ఎన్టీఆర్ రోల్ అదిరిపోతుంది, ఇక ఇంట్రడక్షన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది." అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ భారీ మైథలాజికల్ ఫిల్మ్ పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి కూడా నాగవంశీ స్పందించారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, 2026 ద్వితీయార్థంలో సినిమా మొదలవుతుందని అన్నారు. రామాయణ అనౌన్స్ మెంట్ ను మించేలా భారీస్థాయిలో అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నట్లు నాగవంశీ తెలిపారు.