English | Telugu

షాకింగ్.. ప్రముఖ నిర్మాత అనుమానాస్పద మృతి!

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు (50) కన్నుమూశారు. ఈరోజు (సెప్టెంబర్ 9) తెల్లవారుజామున చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ బాబు హఠాన్మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. అంతేకాదు ఆయన మరణానికి గల కారణం ఏంటో ఇంకా స్పష్టంగా తెలియడంలేదు. సన్నిహిత వర్గాలు మాత్రం, ఢిల్లీ బాబు కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారని, చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని చెబుతున్నారు. అయితే అసలు ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. (Producer Dilli Babu Passes Away)

కాగా, తమిళ సినీ పరిశ్రమలో మంచి అభిరుచి నిర్మాతగా ఢిల్లీ బాబుకి పేరుంది. తమిళ్ లో ఘన విజయం సాధించిన క్రైమ్ థిల్లర్ 'రాక్షసన్'కి నిర్మాత ఆయనే. ఈ సినిమా 'రాక్షసుడు'గా తెలుగులో రీమేక్ అయింది. అలాగే 'ఓ మై కడవులే', 'బ్యాచిలర్', 'మరకతమణి', 'మిరల్', 'కాల్వన్' వంటి చిత్రాలను ఢిల్లీ బాబు నిర్మించారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.